రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు గాయాలు

ABN , First Publish Date - 2021-04-13T05:15:37+05:30 IST

మండల పరిధిలోని చింతకుంట సమీపంలో కడప-కర్నూలు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు గాయాలు
చింతకుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రసన్న

దువ్వూరు, ఏప్రిల్‌ 12: మండల పరిధిలోని చింతకుంట సమీపంలో కడప-కర్నూలు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు... నంద్యాలకు చెందిన భార్యాభర్తలు మధు, ప్రసన్న తమ సొంత కా రులో నంద్యాల నుంచి కడపకు వస్తుండగా చింతకుంట వద్ద వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. దీంతో ప్రసన్న కాలికి తీవ్ర గాయమైంది. ఆమె భర్త మధుకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభు త్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ప్రసన్నను హైదరాబాద్‌కు తరలిం చారు. కాగా ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతింది.

Updated Date - 2021-04-13T05:15:37+05:30 IST