రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

ABN , First Publish Date - 2022-01-21T06:47:52+05:30 IST

చిట్యాలలో జాతీయ రహదారిపై రైల్వేస్టేషన రోడ్డు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

చిట్యాల, జనవరి 20: చిట్యాలలో జాతీయ రహదారిపై రైల్వేస్టేషన రోడ్డు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. చిట్యాలకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఏనుగు అంజిరెడ్డి తన ద్విచక్ర వాహనంపై రైల్వేస్టేషన రోడ్డు వద్ద క్రాస్‌ చేస్తుండగా హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.



 

Updated Date - 2022-01-21T06:47:52+05:30 IST