విద్యుదాఘాతంతో రైతుకు గాయాలు
ABN , First Publish Date - 2022-01-24T05:21:36+05:30 IST
విద్యుదాఘాతంతో రైతుకు గాయాలు
దోమ, జనవరి 23: ట్రాన్స్కో అధికారులు, సిబ్బంది నిర్వాకంతో ఓ రైతు విద్యుద్ఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. దోమ మండలం రాకొండకు చెందిన పిల్లి అంజిలయ్యకు పొలం వద్ద బోరు మోటారు ఉంది. బోరు విద్యుత్ బిల్లులు బకాయిలు చెల్లించాలని అంజిలయ్యను అధికారులు ఒత్తిడి చేయడంతో రూ.2వేలు కడతానని వారికి చెప్పాడు. రైతు మాట వినకుండా ట్రాన్స్కో సిబ్బంది విద్యుత్ కనెక్షన్ కట్చేశారు. వరి పొలానికి నీరు పారించాలని అంజిలయ్య ట్రాన్స్ఫార్మర్ ఆఫ్చేసి స్తంభంపైకి ఎక్కి వైరు కనెక్షన్ ఇస్తుండగా విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. దీంతో అతడికి తీవ్రగాయాలు కాగా కుటుంబ సభ్యులుపరిగి ఆస్పత్రికి తరలించారు. ట్రాన్స్కో అధికారుల కారణంగానే తన భర్త విద్యుద్ఘాతానికి గురయ్యాడని అతడి భార్య, కుటుంబీకులు ఆరోపించారు.