హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలమూరు వెంకట్‌కు గాయాలు

ABN , First Publish Date - 2021-10-03T01:40:55+05:30 IST

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థికి బలమూరు వెంకట్‌కు గాయాలయ్యాయి. శనివారం దిల్‌సుఖ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్ మోగించింది

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలమూరు వెంకట్‌కు గాయాలు

హుజురాబాద్: హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలమూరు వెంకట్‌కు గాయాలయ్యాయి. శనివారం దిల్‌సుఖ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి జంగ్ సైరన్ మోగించింది. విద్యార్థి జంగ్ సైరన్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్ నేతలు, పోలీసుల మధ్య వాద్వివాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసుల దాడిలో వెంకట్ గాయపడ్డారు. పోలీసుల వలయాన్ని దాటుకుని తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన శ్రీకాంతాచారి విగ్రహం వద్దకు వెంకట్ వెళ్లారు. ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల ఘర్షణలో బలమూరు వెంకట్ గాయపడ్డారు. వెంటనే నాగోల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. హుజురాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించిన కొద్దిసేపటికే వెంకట్ గాయాలపాలైనారు. 


నేడు కాంగ్రెస్ విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో ఆ పార్టీ ఆందోళనలకు పిలుపునచ్చింది. విద్యార్థి సమస్యలపై 65 రోజులపాటు జంగ్ సైరన్ పేరుతో కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టనుంది. దిల్‌సుఖ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్ మోగించనుంది. డిసెంబర్ 9న రాహుల్ గాంధీసభతో ఈ కార్యక్రమం ముగియనుంది.

Updated Date - 2021-10-03T01:40:55+05:30 IST