బైక్‌పైనుంచి పడి యువకుడికి గాయాలు

ABN , First Publish Date - 2022-05-24T05:40:50+05:30 IST

బైక్‌పైనుంచి పడి యువకుడికి గాయాలు

బైక్‌పైనుంచి పడి యువకుడికి గాయాలు

కొడంగల్‌ రూరల్‌, మే 23: ముందు వెళ్తున్న బైక్‌ను ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో అదుపు తప్పి పడిపోవడంతో యువకుడికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... అన్నారానికి చెందిన తిమ్మాయిపల్లి నర్సింలు పల్సర్‌ బైక్‌పై సోమవారం కోస్గికి వెళ్తున్నా డు. పర్సాపూర్‌ శివారులో ముందు మరో బైక్‌ను ఓవర్‌ టేక్‌ చేస్తుండగా పల్సర్‌ అదుపుతప్పి నర్సింలు పడిపోయాడు. దీంతో అతడికి ఎడమ కాలు, చేయి విరిగింది. తోటి వాహనదారులు ఆటోలో కొడంగల్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌కు రెఫర్‌ చేసినట్లు వైద్యులు తెలిపారు.

Updated Date - 2022-05-24T05:40:50+05:30 IST