గాయపడిన వెల్డర్ చికిత్సపొందుతూ మృతి
ABN , First Publish Date - 2021-02-25T05:43:34+05:30 IST
కంపెనీలో వెల్డింగ్ పనులు నిర్వహిస్తున్న వెల్డర్ రేకుల షెడ్పైనుంచి పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
తూప్రాన్ (మనోహరాబాద్), ఫిబ్రవరి 24: కంపెనీలో వెల్డింగ్ పనులు నిర్వహిస్తున్న వెల్డర్ రేకుల షెడ్పైనుంచి పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ సంఘటన మనోహరాబాద్ మండలం కాళ్లకల్ పారిశ్రామికవాడలో చోటు చేసుకుంది. మనోహరాబాద్ ఎస్ఐ రాజు కథనం ప్రకారం... సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరారెడ్డిపల్లికి చెందిన బుద్ధుల హన్మంతు (27) వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. ఈనెల 19న మనోహరాబాద్ మండలం కాళ్లకల్ ఇండస్ట్రీయల్ పార్కులోని రేణుకా ఫ్యాబ్రికేషన్ కంపెనీలో వెల్డింగ్ పనులు చేసేందుకు వెళ్లాడు. పనులు చేస్తుండగా 25 అడుగుల ఎత్తు నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన హన్మంతును సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. కంపెనీ యాజమాన్యం, కాంట్రాక్టర్ వెంకట్రెడ్డి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, సేఫ్టీ ప్రికాషన్లు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే తన భర్త మృతి చెందినట్లు మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు వివరించారు.