కొడుకు చేతిలో గాయపడి ...

ABN , First Publish Date - 2022-08-15T05:58:42+05:30 IST

కొడుకు చేతిలో గాయపడి ...

కొడుకు చేతిలో గాయపడి ...

  • చికిత్స పొందుతూ మహిళ మృతి

కందుకూరు, ఆగస్టు, 14: కొడుకు గాయపర్చడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతిచెందిన సంఘటన పుమామిడిలో చోటుచేసు కుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పులిమామిడికి చెందిన జాల బాలమణి(40) తన కొడుకు రమే్‌షకు అడిగినప్పుడల్లా  డబ్బులు ఇచ్చేది. ఈ క్రమంలో ఈ నెల 9న సాయంత్రం బాలమణి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆమెను కొడుకు కొట్టి గాయపర్చాడు. ఆమెను గ్రామస్తులు ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. దీనిపై ఇంకా తమకు సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-08-15T05:58:42+05:30 IST