అర్హులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలంటూ దీక్ష

ABN , First Publish Date - 2020-08-04T11:27:38+05:30 IST

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు అందించాలని వద్దిపర్రుకు చెందిన దివ్యాంగుడు వడ్లపాటి రవికుమార్‌ పంచాయ తీ కార్యాలయం ఎదుట ..

అర్హులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలంటూ దీక్ష

పోడూరు, ఆగస్టు 3 : అర్హులందరికీ ఇళ్ల స్థలాలు అందించాలని వద్దిపర్రుకు చెందిన దివ్యాంగుడు వడ్లపాటి రవికుమార్‌ పంచాయ తీ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. వద్దిపర్రు పంచాయతీ కార్యాల యం ఎదుట ఇళ్ల స్థలాల అక్రమాలపై విచార ణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ విష యంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో విచారణ చేపట్టి అనర్హులను తొలగించి అర్హులను జాబితా లో చేర్చాలని కోరారు. ఎస్‌ఐ బి.సురేంద్ర కుమార్‌ డిమాండ్‌ను నమోదు చేసుకోగా అర్హులందరికీ న్యాయం చేస్తామని తహసీల్దార్‌ పి.ప్రతాపరెడ్డి సెల్‌ఫోన్‌లో హామీ ఇవ్వడంతో దీక్షను విరమించినట్టు ఆయన తెలిపారు.

Updated Date - 2020-08-04T11:27:38+05:30 IST