మూడో రోజు వైఎస్ షర్మిల దీక్ష.. అభిమానులకు విజ్ఞప్తి

ABN , First Publish Date - 2021-04-17T14:57:34+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష మూడవ...

మూడో రోజు వైఎస్ షర్మిల దీక్ష.. అభిమానులకు విజ్ఞప్తి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష మూడవ రోజుకు చేరుకుంది. కోవిడ్ వైరస్ దృష్ట్యా మాస్క్ ధరించి దీక్ష చేస్తున్నారు. దీక్షలో ఉన్న షర్మిలకు డాక్టర్లు పరీక్షలు చేశారు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే.. షర్మిలను కలవడానికి అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున దీక్షా వేదిక వద్దకు వస్తుండటంతో .. ఎవరూ ఇక్కడికి రావొద్దని ఆమె టీమ్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. కాగా.. మూడ్రోజుల పాటు తాను దీక్ష చేపడుతానని షర్మిల చెప్పగా.. పోలీసులు మాత్రం ఒకే ఒక్కరోజు దీక్షకు మాత్రమే అనుమతిచ్చిన విషయం విదితమే. నేటితో షర్మిల దీక్ష ముగిసే అవకాశముంది.

Updated Date - 2021-04-17T14:57:34+05:30 IST