రెండో రోజు కొనసాగుతున్న వైఎస్ షర్మిల దీక్ష

ABN , First Publish Date - 2021-04-16T17:50:21+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష రెండవ రోజుకు చేరుకుంది...

రెండో రోజు కొనసాగుతున్న వైఎస్ షర్మిల దీక్ష

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. తొలిరోజు ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ వద్ద వైఎస్ షర్మిల దీక్షను ప్రారంభించగా సాయంత్రం తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు, అభిమానుల మధ్య జరిగిన తోపులాటలో ఆమె ఒక దశలో సొమ్మసిల్లి పడిపోయారు. ఆమె చేతికి గాయం కూడా అయ్యింది. అయితే గురువారం సాయంత్రం నుంచి లోటస్‌పాండ్‌లోని తన ఇంట్లోనే షర్మిల ఆమె దీక్ష చేపట్టారు. నిన్నటి నుంచీ దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. దీక్షలో ఉన్న షర్మిలకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. కాగా.. మూడ్రోజుల పాటు దీక్ష చేపడుతానని షర్మిల చెప్పగా.. పోలీసులు ఒక్కరోజు మాత్రమే అనుమతిచ్చిన విషయం విదితమే.

Updated Date - 2021-04-16T17:50:21+05:30 IST