మోకాళ్లపై నిలబడి రెండో రోజు న్యాయవాదుల దీక్ష

ABN , First Publish Date - 2021-03-03T05:07:52+05:30 IST

ఫెడరేషన్‌ ఆఫ్‌ బార్‌ అసోసియేషన్‌ పిలుపు మే రకు మంగళవారం 2వ రో జు మోకాళ్లపై నిలబడి న్యా యవాదులు దీక్షను చేప ట్టారు.

మోకాళ్లపై నిలబడి రెండో రోజు న్యాయవాదుల దీక్ష
మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు

నారాయణపేట, మార్చి 2 : ఫెడరేషన్‌ ఆఫ్‌ బార్‌ అసోసియేషన్‌ పిలుపు మే రకు మంగళవారం 2వ రో జు మోకాళ్లపై నిలబడి న్యా యవాదులు దీక్షను చేప ట్టారు. ప్రభుత్వ పరిశీలన లో ఉన్న న్యాయవాద పరిర క్షణ చట్టాన్ని తేవాలని డిమాండ్‌ చేశారు. పెద్దపల్లిలో జంట న్యాయవాదుల హత్య కేసును సీబీఐకి బద లార ుుంచాలని, ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. కార్యక్రమంలో బార్‌ అసోసియే షన్‌ అధ్యక్షుడు దామోదర్‌ గౌడ్‌, న్యాయవాదులు వెంకట్‌రెడ్డి, అబ్దుల్‌ సలీం, లక్ష్మీపతి గౌడ్‌, సత్య నారాయణ, కృష్ణ, నర్సిములు తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల దీక్షకు జిల్లా సాధన సమి తి కన్వీనర్‌ మనోహర్‌ గౌడ్‌, బీకేఎస్‌ నాయకులు చింతల్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, ప్రభూ మద్దతు పలికా రు. న్యాయవాదుల దీక్షకు టీడీపీ నాయకులు మద్దతు పలికారు. కార్యక్రమంలో టీడీపీ నాయకు లు పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాములు యాదవ్‌, ప్రచార కార్యదర్శి వినయ్‌ మిత్ర, రాఘవరావు, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-03T05:07:52+05:30 IST