కాపవరంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలపై విచారణ ప్రారంభం
ABN , First Publish Date - 2020-10-01T07:52:10+05:30 IST
కాపవరం గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం నాగార్జున ఫెర్టిలైజర్స్కు సంబంధించిన 201 ఎకరాల
బిక్కవోలు, సెప్టెంబరు 30: కాపవరం గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం నాగార్జున ఫెర్టిలైజర్స్కు సంబంధించిన 201 ఎకరాల భూముల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలపై మైన్స్ శాఖ విచారణ చేపట్టింది.
ఆశాఖ అసిస్టెంట్ జియాలజిస్టు జి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది తవ్వకాలను పరిశీలించి కొలతలు నమోదు చేశారు. విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. సూపర్వైజర్ ప్రసాద్, టీఏ హరీ్షవిజయ్, మండల సర్వేయర్ గణేష్ పాల్గొన్నారు.