ప్రారంభమైన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
ABN , First Publish Date - 2021-10-26T06:07:25+05:30 IST
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి.
- జిల్లా వ్యాప్తంగా 6,010 విద్యార్థుల హాజరు, 532 గైర్హాజరు
పెద్దపల్లి కల్చరల్, అక్టోబరు 25: ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. జిల్లాలో 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని ఆయా పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. సోమవారం విద్యార్థులను స్కానర్తో పరీక్షలు నిర్వహించి శానిటైజర్, మాస్కులు ఉండేలా చూసి విద్యార్థులను పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించారు. కాగా సోమవారం జరిగిన తెలుగు, సంస్కృతం, ఉర్దూ, హిందీ పరీక్షలకు 6,542 మంది విద్యార్థులకు 6010 మంది విద్యార్థులు హాజరయ్యారు. 532 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు. కాగా 92 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు నోడల్ అధికారికి కల్పన పేర్కొన్నారు. ఆయా పరీక్ష కేంద్రాలను జిల్లా కేంద్రంలోని సెంటర్ లను నోడల్ అధికారిణి కల్పన పరిశీలించారు.