తొలుత ‘0’.. పునఃపరిశీలనలో 44
ABN , First Publish Date - 2022-07-07T09:33:56+05:30 IST
ఇంటర్బోర్డు అధికారుల నిర్వాకం ఓ విద్యార్థికి ఇచ్చిన మార్కులతో తేటతెల్లమైంది. ఖమ్మం జిల్లా ముదిగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బద్రీ గోపి అనే విద్యార్థి ఈహెచ్పీ కోర్సు చదివాడు.
మూల్యాంకనంలో ఇంటర్బోర్డు నిర్వాకం
ముదిగొండ, జూలై 6: ఇంటర్బోర్డు అధికారుల నిర్వాకం ఓ విద్యార్థికి ఇచ్చిన మార్కులతో తేటతెల్లమైంది. ఖమ్మం జిల్లా ముదిగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బద్రీ గోపి అనే విద్యార్థి ఈహెచ్పీ కోర్సు చదివాడు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అతడికి ఎకనామిక్స్ సబ్జెక్టులో ‘0’ మార్కులు రాగా.. మిగతా సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించాడు. దీంతో గోపి పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో.. ఎకనామిక్స్లో ‘44’ మార్కులు వచ్చినట్టుగా ఇంటర్ అధికారులు పునఃఫలితాలు వెలువరించారు.