సవాళ్లను అధిగమించేలా స్కూళ్లను తీర్చిదిద్దాలి

ABN , First Publish Date - 2020-06-07T08:15:59+05:30 IST

కొవిడ్‌ అనుభవాల నేపథ్యంలో రానున్న కాలంలో ఎదురయ్యే మరిన్ని సవాళ్లను అధిగమించేలా పాఠశాలలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని,

సవాళ్లను అధిగమించేలా స్కూళ్లను తీర్చిదిద్దాలి

  • ఇన్ఫోసిస్‌ చైర్మన్‌ నందన్‌ నీలేకని

న్యూఢిల్లీ, జూన్‌ 6 : కొవిడ్‌ అనుభవాల నేపథ్యంలో రానున్న కాలంలో ఎదురయ్యే మరిన్ని సవాళ్లను అధిగమించేలా పాఠశాలలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, ప్రత్యామ్నాయ బోధన పద్ధతుల వైపు దృష్టిసారించాలని ఇన్ఫోసిస్‌ చైర్మన్‌ నందన్‌ నీలేకని అన్నారు.  లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలలు మూతపడటంతో ఆన్‌లైన్‌లో బోధన, అభ్యాస కార్యకలాపాలను విస్తరించడం తాత్కాలికమైన చర్యేనన్నారు.  విద్యార్థులను కొన్ని గంటల వ్యవధికే పరిమితం చేయవద్దని, అభ్యాసం సౌకర్యవంతంగా, ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. ‘పాఠశాలల భవిష్యత్తు-కొవిడ్‌ 19 సవాలును అధిగమించడం’ అనే అంశంపై అశోకా వర్సిటీ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన సదస్సులో నీలేకని కీలకోపన్యాసం చేశారు. భిన్న సామర్థ్యాలున్న విద్యార్థులతో భిన్నంగా వ్యవహరించగలిగేలా నైపుణ్యాలను ఉపాధ్యాయులు అభివృద్ధి చేసుకోవాలని ఆయన ఈసందర్భంగా కోరారు. 

Updated Date - 2020-06-07T08:15:59+05:30 IST