రిపాట్రియేష‌న్ కోసం మ‌ళ్లీ రిజిస్ట్రేష‌న్ ప్రారంభించిన భార‌త‌ ఎంబ‌సీ .. కువైట్‌లో..

ABN , First Publish Date - 2020-06-03T18:50:36+05:30 IST

స్వ‌దేశానికి రావాల‌నుకుంటున్న ఎన్నారైల కోసం కువైట్‌లోని భార‌త ఎంబ‌సీ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను మ‌ళ్లీ ప్రారంభించింది.

రిపాట్రియేష‌న్ కోసం మ‌ళ్లీ రిజిస్ట్రేష‌న్ ప్రారంభించిన భార‌త‌ ఎంబ‌సీ .. కువైట్‌లో..

కువైట్ సిటీ: స్వ‌దేశానికి రావాల‌నుకుంటున్న ఎన్నారైల కోసం కువైట్‌లోని భార‌త ఎంబ‌సీ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను మ‌ళ్లీ ప్రారంభించింది. దీనికోసం కువైట్‌లో చిక్కుకున్న భార‌త ప్ర‌వాసులు ఎంబ‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో త‌మ పేర్ల‌ను రిజిస్ట‌ర్ చేసుకోవాలి. అయితే, ఇది కేవ‌లం డేటా క‌లెక్ష‌న్ కోసం మాత్రమేన‌ని, ఇది టిక్కెట్ క‌న్ఫ‌ర్మేష‌న్ కాద‌ని సంబంధిత అధికారులు వెల్ల‌డించారు. కాగా... ఈ ప్ర‌క్రియ నిలిచిపోవ‌డానికి ముందు 60వేల మంది రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌డం జ‌రిగిందని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ఇక తాజా రిజిస్ట్రేష‌న్ కోసం https://indembkwt.com/eva/ వెబ్‌సైట్‌లో చూడాల‌ని కోరింది.     

Updated Date - 2020-06-03T18:50:36+05:30 IST