శ్రీరాంసాగర్కు 3.82లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో
ABN , First Publish Date - 2021-10-01T02:00:57+05:30 IST
నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్కు వరద పోటెత్తుతోంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో.. గురువారం ప్రాజెక్టులోకి 3.82లక్షల క్యూసెక్కుల
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్కు వరద పోటెత్తుతోంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో.. గురువారం ప్రాజెక్టులోకి 3.82లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 33గేట్లు ఎత్తి.. 3.50లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర నుంచి ప్రాజెక్టుకు వచ్చే వరదను అంచనా వేస్తూ అధికారులు నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. కాగా.. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1091 అడుగుల మేర నీటి నిల్వ ఉంది.