మాంద్యం అప్పటివరకు కొనసాగవచ్చు... ఎలాన్ మస్క్

ABN , First Publish Date - 2022-05-17T22:36:22+05:30 IST

అమెరికాలో మాంద్యం మరో సంవత్సరమున్నరపాటు కొనసాగే పరిస్థితి ఉండవచ్చునని టెస్లా కార్ల కంపెనీ అధినేత, ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డాడు.

మాంద్యం అప్పటివరకు కొనసాగవచ్చు...  ఎలాన్ మస్క్

న్యూయార్క్ : అమెరికాలో మాంద్యం మరో సంవత్సరమున్నరపాటు కొనసాగే పరిస్థితి ఉండవచ్చునని టెస్లా కార్ల కంపెనీ అధినేత, ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డాడు. న్యూయార్క్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యుఎస్ మాంద్యం 18 నెలల వరకు కొనసాగవచ్చునని, అయితే 'మాంద్యం తప్పనిసరిగా చెడ్డ విషయం మాత్రం కాదని వ్యాఖ్యానించారు. అమెరికా మాంద్యంలో ఉందని, అది మరింత దిగజారుతుందని తాను భావిస్తున్నట్లు ఎలోన్ మస్క్ పేర్కొన్నారు.


‘మాంద్యం  తప్పనిసరిగా చెడ్డ విషయం కాదు. నేను అగువంటి పరిస్థితులను  ఎదుర్కొన్నాను’ అని పేర్కొన్న మస్క్... ‘ఎకనామిక్ ఎనిమా  చివరికు... పైప్‌లను క్లియర్ చేయవలసి ఉంటుంది’ అంటూ   చమత్కరించాడు. ‘ఒక విధమైన బుల్‌షిట్ కంపెనీలు దివాలా తీస్తాయి. ఉపయోగకరమైన ఉత్పత్తులను చేస్తున్నవి సంపన్నమైనవి’ అని వ్యాఖ్యానించాడు. ఎవరైనా ఉపయోగకరమైన ఉత్పత్తిని తయారు చేస్తుంటే, అర్ధవంతమైన కంపెనీని కలిగి ఉంటే... ఇక్కడ ఖచ్చితంగా ఒక పాఠం ఉంది.  మీరు మూలధన దృక్కోణం నుండి అంచుకు చాలా దగ్గరగా వస్తువులను ఉత్పత్తి చేయడం లేదని నిర్ధారించుకోండి’... అని వ్యాఖ్యానించాడు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ పరిపాలనపై మాంద్యానికి సంబంధించిన వ్యాఖ్యలతో మస్క్ ఒకింత నిరసన వ్యక్తం చేశారు. ‘ఈ అడ్మినిస్ట్రేషన్, పూర్తి స్థాయిలో లేదు’... అని వ్యాఖ్యానించాడు. ‘ట్రంప్ పరిపాలనను, ట్రంప్‌ను పక్కన పెడితే...  పరిపాలనలో చాలా మంది వ్యక్తులు పని చేయడంలో ప్రభావవంతంగా ఉన్నారు’ అని మస్క్ పేర్కొన్నారు. "ద్రవ్యోల్బణానికి స్పష్టమైన కారణమేమిటంటే... ప్రభుత్వం తన వద్ద ఉన్న దానికంటే ఎక్కువ మొత్తంలో ముద్రించింది. ద్రవ్యోల్బణం లేకుండా ప్రభుత్వం అధిక రాబడి కోసం చెక్కులను జారీ చేయదు. డబ్బు యొక్క వేగం స్థిరంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. మస్క్... గతంలోనూ బిడెన్ పరిపాలనపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం ప్రారంభంలో... ‘"మానవ రూపంలో ఉన్న తోలుబొమ్మ’ అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘పూర్తిగా స్పష్టంగా చెప్పాలంటే... బిడెన్ ఏమి చేస్తున్నాడో చెప్పడం కష్టం’ అని మస్క్ వ్యాఖ్యానించడం విశేషం. కాగా... మాంద్యం గురించి మస్క్ వ్యాఖ్యానించడం ఇదే  మొదటిసారి కాదు. రానున్న రెండేళ్ళలో తదుపరి మాంద్యం వస్తుందని తాను నమ్ముతున్నట్లు కిందటి సంవత్సరం జరిగిన ఓ కార్యక్రమంలో మస్క్ పేర్కొన్నారు. ఇక... వచ్చే ఏడాది(2023 లో)... అమెరికా మాంద్యంలోకి వస్తుందని భావిస్తున్నట్లు మస్క్ పేర్కొన్నారు.

Updated Date - 2022-05-17T22:36:22+05:30 IST