పెంచిన ఆస్తి, చెత్త పన్ను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2022-01-26T06:04:45+05:30 IST
జీవీఎంసీ పరిధిలో పెంచిన చెత్త, ఆస్తి పన్ను రద్దు చేయాలని టీడీపీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
టీడీపీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్
గాజువాక, జనవరి 25: జీవీఎంసీ పరిధిలో పెంచిన చెత్త, ఆస్తి పన్ను రద్దు చేయాలని టీడీపీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన 66వ వార్డు ప్రతినిఽఽధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆస్తి, చెత్త పన్ను పెంపుపై వైసీపీ కార్పొరేటర్లను ప్రజలు నిలదీయాలన్నారు. కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. మాజీ కార్పొరేటర్ మహ్మద్ రఫీ, నాయకులు వాసు, ముర్తజా, సత్యనారాయణ, రత్న్కాంత్, బాబా, శివ, వెంకటరమణ, రాంబాబు పాల్గొన్నారు.