పెంచిన పెట్రో ధరలను తగ్గించాలి

ABN , First Publish Date - 2021-10-20T04:32:32+05:30 IST

పెంచిన పెట్రో ధరలను తగ్గించాలి

పెంచిన పెట్రో ధరలను తగ్గించాలి
తాండూరులో ధర్నా నిర్వహిస్తున్న యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు

  • యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా 

తాండూరు/కొడంగల్‌ రూరల్‌: పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని యువజన కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తాండూరు పట్టణంలో యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్‌ చౌక్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. సామాన్యులకు తలకు మించిన భారంగా మూడు నెలల్లో 13సార్లు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేనారెడ్డి  పిలుపుమేరకు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.  కార్యక్రమంలో  యువజన కాంగ్రెస్‌ నాయకులు కావలి సంతోష్‌, అనిల్‌గౌడ్‌, బోయ అశోక్‌, బషీరాబాద్‌ మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు శంకరప్ప, మోహిన్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కొడంగల్‌లోని అంబేద్కర్‌ చౌరస్తాలో రోడ్డుపై బైటాయించి ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ధర్నా విరమింపజేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో యూత్‌ కాంగ్రెస్‌ స్టేట్‌ జనరల్‌ సెక్రటరీ కృష్ణంరాజు, అనితారెడ్డి, కొడంగల్‌ నయిం, శంకర్‌నాయక్‌, రేవంత్‌ సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు బ్యాగరినరసింహ, కొడంగల్‌ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రెడ్డిశ్రీను, వైస్‌ ప్రెసిడెంట్‌ బ్యాగరికృష్ణ, సింగర్‌ నరసింహా, జనరల్‌ సెక్రటరీ బంటురాజగోపాల్‌ ఉన్నారు. 

Updated Date - 2021-10-20T04:32:32+05:30 IST