పెంచిన పెట్రో ధరలు రద్దుచేయాలి
ABN , First Publish Date - 2022-05-26T06:44:04+05:30 IST
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రో, గ్యాస్ ధరలు తూ తూ మంత్రంగా తగ్గించడం కాదని, పెంచిన మొత్తం ధరల్ని వెనక్కి తీసుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చ రించాయి.
సిరిపురం, మే 25: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రో, గ్యాస్ ధరలు తూ తూ మంత్రంగా తగ్గించడం కాదని, పెంచిన మొత్తం ధరల్ని వెనక్కి తీసుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చ రించాయి. సిరిపురం హెచ్పీసీఎల్ పెట్రోల్ బంక్ వద్ద నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై.కొండయ్య, ఎస్ యూసీఐసీ జిల్లా ఇన్చార్జి పి.గోవిందరాజులు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రధాని మోదీ పెంచిన ధరలు తగ్గిస్తామని చెప్పిన మాట మర్చిపో యారన్నారు. ఏడేళ్లలో అన్ని ధరలు పెంచి సామాన్యులను విలవిల్లాడేలా చేశార న్నారు. కార్యక్రమంలో జగన్, కృష్ణారావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.