పరిశ్రమల యజమానులు సర్టిఫికెట్ సమర్పించాలి
ABN , First Publish Date - 2020-05-27T10:35:47+05:30 IST
కావలి డివిజన్లోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానులు జిల్లా పరిశ్రమల శాఖ జారీచేసిన తాజా సర్టిఫికెట్ను ..
కావలి, మే 26 : కావలి డివిజన్లోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానులు జిల్లా పరిశ్రమల శాఖ జారీచేసిన తాజా సర్టిఫికెట్ను సమర్పించాలని కావలి విద్యుత్శాఖ ఈఈ భాస్కర్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థిర డిమాండ్ చార్జీల రద్దు, భారీ పరిశ్రమల స్థిర డిమాండ్ వాయిదా వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. మరింత సమాచారం కోసం నెల్లూరులోని ఏకే నగర్లోని జిల్లా పరిశ్రమలశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.