అధికారులకు సూచనలు ఇస్తున్న కలెక్టర్ భారతి హోళికేరి
మంచిర్యాల కలెక్టరేట్, జనవరి 18: టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలలో స్ధానికులకు ఉపాధి కల్పనకు కృషి చేయాలని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశానికి హాజరై టీఎస్ ఐపాస్ ద్వారా వివిధ శాఖలు జారీ చేసే అనుమతులపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి సంబంధించిన అనుమతులను టీఎస్ ఐపాస్ ద్వారా నిర్ధేశిత గడువులోగా అర్హులైన వారికి అందజేయాలని ఆదేశించారు. టిఫ్రైడ్ పథకం ద్వారా దళితులకు సంబంధిం చిన ఐదు పెట్టుబడి రాయితీ దరఖాస్తులను ఆమోదిస్తూ రూ.16లక్షల40వేలు, గిరిజనులకు సంబంధిత నాలుగు పెట్టుబడి రాయితీ దరఖాస్తులను ఆమో దిస్తూ రూ.13లక్షల49 వేలు, దళితులకు సంబంధించిన 7 పావలా వడ్డీ రాయి తీ దరఖాస్తులకు రూ.1లక్ష45 వేలను మంజూరు చేశామన్నారు. సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ హవేలి రాజు, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఎం. హరనాధ్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రవీందర్రెడ్డి, పాల్గొన్నారు.