నిబంధనలకు అనుగుణంగా పరిశ్రమలు నడపాలి

ABN , First Publish Date - 2022-08-19T05:47:10+05:30 IST

ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు పాటిస్తూ పరిశ్రమలు నడిపించాలని అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

నిబంధనలకు అనుగుణంగా పరిశ్రమలు నడపాలి
అభిప్రాయ సేకరణ సభలో మాట్లాడుతున్న శ్రీనివాస్‌రెడ్డి

భూదాన్‌పోచం పల్లి, ఆగస్టు 18 : ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు పాటిస్తూ పరిశ్రమలు నడిపించాలని అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్‌ముఖి గ్రామశివారులోని శ్రీవెంకటశివ మెటల్‌ ఇండస్ట్రీస్‌ ఆధ్వర్యంలో రఫ్‌స్టోన్‌, రోడ్‌మెటల్‌ను ఏడాదికి 1,38,720 క్యూబిక్‌ మీటర్ల మైనింగ్‌ చేసేందుకు ప్రతిపాదించగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, నల్లగొండ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో గురువారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజలు హాజరుకాలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్‌జీవో(స్వచ్ఛంద సంస్థల) ప్రతినిధులతో తమకు అనుకూలంగా రికార్డు చేసి ప్రజాభిప్రాయసేకరణను ముగించారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సురే్‌షబాబు, చౌటుప్పల్‌ ఆర్డీవో సూరజ్‌కుమార్‌, తహసీల్దారు బి వీరాబాయి, సీఐ వెంకటయ్య, ఎస్‌ఐ సైదిరెడ్డి, ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T05:47:10+05:30 IST