కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలను పాటించాలి
ABN , First Publish Date - 2021-03-05T05:41:32+05:30 IST
కర్మాగారాలలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఇన్చార్జి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సురేష్ చెప్పారు.
ఇన్చార్జి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సురేష్
కార్పొరేషన్(కాకినాడ),మార్చి4: కర్మాగారాలలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఇన్చార్జి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సురేష్ చెప్పారు. కోరమండల్ కర్మాగారంలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ రంగనాయకులు అధ్యక్షతన గురువారం 50వ జాతీయ భద్రత ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇన్చార్జి ఎఫ్డీఐ సురేష్ మాట్లాడుతూ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ రంగనాయకులు మాట్లాడుతూ కర్మాగారంలో ఉత్పత్తి కంటే భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. భద్రత పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (సేప్టీ) పీవీ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మేనేజర్లు బీఎల్వీ ప్రసాద్, డి.రవికుమార్, రఘురామరాజు, బాలాజీ, హెచ్ఆర్ జనరల్ మేనేజర్, ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ వరప్రసాద్ పాల్గొన్నారు.