పారిశ్రామిక ప్రాంతం..నిర్మానుష్యం

ABN , First Publish Date - 2021-05-07T05:21:02+05:30 IST

పారిశ్రామిక ప్రాంతంలో కర్ఫ్యూ రెండవ రోజు గురువారం పకడ్బందీగా అమలు చేశారు

పారిశ్రామిక ప్రాంతం..నిర్మానుష్యం
నిర్మానుష్యంగా ఉన్న వడ్లపూడి రహదారి

కూర్మన్నపాలెం, మే 6: పారిశ్రామిక ప్రాంతంలో కర్ఫ్యూ రెండవ రోజు గురువారం పకడ్బందీగా అమలు చేశారు. శ్రీనగర్‌ నుంచి ఆటోనగర్‌ వెళ్లే రహదారి నిత్యం భారీ వాహనాలతో రద్దీగా ఉండేది. అలాంటి రహదారి నిశ్శబ్దంగా మారిపోయింది.  స్వచ్ఛందంగానే ప్రజలు నివాసాలకు పరిమితమయ్యారు. దీంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే వడ్లపూడి జంక్షన్‌, కూర్మన్నపాలెం నుంచి దువ్వాడ రైల్వే స్టేషన్‌ రహదారి, స్టీల్‌ప్లాంట్‌ రహదారి తదితర ప్రాంతాలన్నీ  జనసంచారం లేక బోసిపోయాయి. బస్సులు, ఆటోలు తిరగ లేదు. ప్రైవేటు వాహనాల రాకపోకలు నిలిపి వేశారు. 


Updated Date - 2021-05-07T05:21:02+05:30 IST