పారిశ్రామికవేత్త ఇంట్లో 750 సవర్ల నగల చోరీ

ABN , First Publish Date - 2021-12-30T16:41:43+05:30 IST

జిల్లా గోపాలపట్టినంకు చెందిన ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో రెండు రోజుల క్రితం చోరీకి గురైన 750 సవర్ల బంగారు నగల్ని పక్కనే ఉన్న పాడుబడిన బావి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోపాలపట్టి

పారిశ్రామికవేత్త ఇంట్లో 750 సవర్ల నగల చోరీ

               - పాడుబడిన బావిలో స్వాధీనం


చెన్నై: పుదుకోట జిల్లా గోపాలపట్టినంకు చెందిన ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో రెండు రోజుల క్రితం చోరీకి గురైన 750 సవర్ల బంగారు నగల్ని పక్కనే ఉన్న పాడుబడిన బావి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోపాలపట్టినం నడువీధిలో జగుబర్‌ సాదిక్‌ (55) అనే పారిశ్రామికవేత్తకు చెందిన విలాసవంతమైన నివాసగృహం ఉంది. సాదిక్‌ బ్రూనేలో సూపర్‌ మార్కెట్లు నడుపుతున్నాడు. తరచూ స్వస్థలానికి వచ్చి ఆ నివాసగృహంలో నివసించి వెళుతుండేవాడు. గత యేడాది నుంచి కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆయన స్వస్థలానికి రాలేదు. ఆయన సోదరి కుటుంబీకులు ఆ నివాసగృహాన్ని తరచూ శుభ్రంచేసి తాళం వేసేవారు. ఈ నేపథ్యంలో ఈనెల 26వ తేదీ రాత్రి ఆ నివాసగృహంలో చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు 750 సవర్ల నగలను దోచుకెళ్ళారు. మరుసటి రోజు ఉదయం సాదిక్‌ సోదరి కుమార్తె ఇంటిని శుభ్రం చేసేందుకు వెళ్ళినప్పుడు చోరీ విషయం బయటపడింది. మీమిసల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు.  దొంగల ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు దళాలను రంగంలోకి దింపారు. అదే సమయంలో చోరీ జరిగిన ప్రాంతాన్ని పోలీసులు బుధవారం పరిశీలిస్తుండగా, ఆ నివాసగృహం వెనుక వున్న పాడుపడిన బావిలో నీలిరంగు పాలిథీన్‌ సంచి వుండడం గమనించారు. వెంటనే బావిలో ఉన్న వర్షపు నీటిని మోటారు పంపుల ద్వారా తోడేశారు. ఆ తర్వాత బావిలోకి దిగిన పోలీసులు ఆ పాలిథీన్‌ సంచిని బావి నుంచి వెలుపలకు తెచ్చి విప్పి చూడగా అందులో చోరీకి గురైన నగలు కనిపించాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-12-30T16:41:43+05:30 IST