ఇందుకూరుపేటలో 1100 మందికి వ్యాక్సిన్
ABN , First Publish Date - 2021-07-27T03:37:33+05:30 IST
: మండలంలో సోమవారం 1100 మందికి కొవిడ్ వ్యాక్సిన్లు వేశారు. స్పెషల్ డ్రై సందర్భంగా మైపాడుకు 500, జగదేవిపేట పీహెచ్సీకు
ఇందుకూరుపేట, జూలై 26 : మండలంలో సోమవారం 1100 మందికి కొవిడ్ వ్యాక్సిన్లు వేశారు. స్పెషల్ డ్రై సందర్భంగా మైపాడుకు 500, జగదేవిపేట పీహెచ్సీకు 600 వ్యాక్సిన్లు కేటాయించారు. రెండు పీహెచ్సీలలో ఒక్కరోజులోనే 1100 వ్యాక్సిన్లు వేశారు. వైద్య అధికారులు, ఎంపీడీవో రఫీఖాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
మనుబోలు : మెగా వ్యాక్సిన్డేలో భాగంగా సోమవారం మండలంలో 500మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు వైద్యులు సుబ్బరాజు, శ్వేత తెలిపారు. వైద్యులు సుబ్బరాజు బద్దెవోలు, వీరంపల్లి గ్రామాల్లో అమలవుతున్న మెగా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పరిశీలించారు.