తీన్మార్ మల్లన్నపై మండిపడ్డ ఇంద్రకరణ్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-07-18T21:50:50+05:30 IST

తీన్మార్ మల్లన్నపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టని వారు పంపుతున్న వీడియోలతో

తీన్మార్ మల్లన్నపై మండిపడ్డ ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్: తీన్మార్ మల్లన్నపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టని వారు పంపుతున్న వీడియోలతో ఎక్కడో కూర్చుండి కథలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. నోటికొచ్చినట్లుగా మాట్లాడితే ఆయనకు మంచిది కాదని మంత్రి హెచ్చరించారు. ప్రతి ఇంటికి మంచినీరు అందించేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమానికి రూపకల్పన చేసిందని ఆయన పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో గాంధీ పార్క్ లో రూ 40 కోట్లతో నిర్మించిన10 లక్షల మిషన్ భగీరథ మంచినీటి రిజర్వాయర్ ట్యాంక్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుమారు 100 కిలోమీటర్ల వరకు మిషన్ భగీరథ పైప్ లైన్ వేయడం పూర్తయిందని తెలిపారు. ఈ ట్యాంకు ద్వారా జిల్లా కేంద్రంలోని ప్రతి ఇంటికి మంచి నీరు అందుతుందని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-07-18T21:50:50+05:30 IST