తెలంగాణలో వరద సాయంపై ఆ మంత్రి ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2022-07-23T22:04:08+05:30 IST

వరద సాయం కోరినా కేంద్రం స్పందించట్లేదని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. తక్షణ సహాయంగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని కోరినా...

తెలంగాణలో వరద సాయంపై ఆ మంత్రి ఏమన్నారంటే...

ఆదిలాబాద్: వరద సాయం కోరినా కేంద్రం స్పందించట్లేదని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. తక్షణ సహాయంగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని  కోరినా... ఇంత వ‌ర‌కు ఉలుకు ప‌లుకు లేదని మండిపడ్డారు. నాలుగేండ్లలో వివిధ రాష్ట్రాల‌కు వరద స‌హాయం అందించిన కేంద్రం.... తెలంగాణకు మాత్రం రూపాయి  ఇవ్వ‌లేదని ఆవేదన వ్యక్తతం చేశారు. ప్ర‌కృతి వైప‌రీత్యాల స‌మ‌యంలో రాష్ట్రాల‌కు అండ‌గా ఉండాల్సిన కేంద్ర ప్ర‌భుత్వం త‌న బాధ్య‌త‌ను విస్మరిస్తోందన్నారు. ఆర్థిక  స‌హాయం చేయాల్సింది పోయి... పాలు, పప్పు, ఉప్పుల‌పై జీఎస్టీ రూపంలో సామాన్యుల‌పై  ప‌న్నుల భారం మోపుతోందన్నారు. 

Updated Date - 2022-07-23T22:04:08+05:30 IST