Ts News: ఇంద్రకరణ్రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్
ABN , First Publish Date - 2022-07-23T19:37:05+05:30 IST
మంత్రి ఇంద్రకరణ్రెడ్డి (Indrakaran Reddy)కి సీఎం కేసీఆర్ (CM KCR) ఫోన్ చేశారు. భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్: మంత్రి ఇంద్రకరణ్రెడ్డి (Indrakaran Reddy)కి సీఎం కేసీఆర్ (CM KCR) ఫోన్ చేశారు. భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (Adilabad District)లో వరద పరిస్థితిపై కేసీఆర్ ఆరా తీశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఇంద్రకరణ్రెడ్డిని ఆదేశించారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని కేసీఆర్ సూచించారు. పది రోజుల పాటు కురుస్తున్న వర్షాలకు జిల్లా రైతాంగం చావు దెబ్బతింది. జిల్లాలో ప్రధాన పంటలన్నీ భారీ విస్తీర్ణంలో తుడిచి పెట్టుకపోయాయి. జిల్లావ్యాప్తంగా 50వేల ఎకరాలకుపైగా పత్తి పంట నీటి మునిగి మొక్కలు చనిపోగా మరో 12వేల ఎకరాల్లో కంది, ఇతర పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. వేలాది మంది రైతులు (Farmers) ప్రభుత్వ చేయూత కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే వర్షాలు కురియడంతో రైతాంగం కోటి ఆశలతో ఉత్సాహంగా పత్తి పంట సాగు చేపట్టింది. మొక్కలు మొలచి ఏపుగా పెరుగుతున్నాయనుకుంటున్న దశలో అతి వృష్టి కారణంగా రైతులు ఒక్కొక్క ఎకరాపై రూ.15వేలకుపైగా నష్ట పోయారు. ప్రస్తుతం మళ్లీ పంటలు నాటే పరిస్థితి కూడా లేదని రైతులు చెబుతున్నారు.