రేవంత్..వల్గర్ మాటలు మానుకోవాలి: ఇంద్రకరణ్ రెడ్డి
ABN , First Publish Date - 2021-08-10T22:08:19+05:30 IST
రేవంత్..వల్గర్ మాటలు మానుకోవాలి: ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్: రేవంత్ భాషను ప్రజలు చీ అంటున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పోడు వ్యవసాయంపై మాట్లాడే అర్హత మీకు లేదన్నారు. పోడు భూముల పై హక్కు కల్పించడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రేవంత్ అబద్దాలు మాట్లాడితే నాలుక తెగ కోస్తామన్నారు. రేవంత్ను ప్రజలెవరూ నమ్మరని చెప్పారు. ప్రజలకు ఏం చేస్తావో చెప్పి మెప్పించాలని సూచించారు. వల్గర్ మాటలు మానుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు.