కొవిడ్‌ పరీక్షలకు 'ఇంద్ర' బస్సులు

ABN , First Publish Date - 2020-07-09T22:00:47+05:30 IST

ప్రజా రవాణా వ్యవస్థపై కరోనా పిడుగు పడింది. లాక్‌డౌన్‌ సహా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో ప్రజలు బస్సు ప్రయాణాలను తగ్గించుకున్నారు.

కొవిడ్‌ పరీక్షలకు 'ఇంద్ర' బస్సులు

అమరావతి: ప్రజా రవాణా వ్యవస్థపై కరోనా పిడుగు పడింది. లాక్‌డౌన్‌ సహా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో ప్రజలు బస్సు ప్రయాణాలను తగ్గించుకున్నారు. 64 లక్షల నుంచి 2 లక్షలకు ఆక్యుపెన్సీ పడిపోయింది. ఆర్టీసీకి కిలోమీటరుకు రూ.15 నష్టం వస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణం, కొవిడ్‌ పరీక్షలకు 'ఇంద్ర' బస్సులును నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. మార్కెటింగ్‌ శాఖతో చేసుకున్న ఒప్పందం మేరకు పల్లెవెలుగు బస్సులను ‘మొబైల్‌ జనతా బజార్‌’ పేరుతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికీ ఒకటి చొప్పున పంపినట్టు అధికారులు చెబుతున్నారు.ప్రత్యామ్నాయ ఆదాయాలపై దృష్టి సారించామని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి తెలిపారు. కార్గో రవాణాలో భాగంగా మార్క్‌ఫెడ్‌ లాంటి సంస్థలతో ఒప్పందం చేసుకుని రైతులకు విత్తనాల సరఫరా నుంచి ఎరువుల చేరవేత వరకు బస్సులను వినియోగిస్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా పుస్తకాలు, పౌరసరఫరాల శాఖకు బియ్యం, ఇతర పప్పు దినుసులు కూడా బస్సుల ద్వారా సరఫరా చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్టు మాదిరెడ్డి వివరించారు. 

Updated Date - 2020-07-09T22:00:47+05:30 IST