భార్యను కరిచిందని కుక్కను చంపేశాడు..!

ABN , First Publish Date - 2021-06-04T03:47:31+05:30 IST

పొరుగింటి వారి కుక్క తన భార్యను కరిచిందన్న కోపంలో ఓ వ్యక్తి ఆ కుక్కను గన్నుతో కాల్చి చంపేశాడు. దీంతో..నిందితుడు నరేంద్ర విశ్వయ్యను పోలీసులు అరెస్టు చేశారు.

భార్యను కరిచిందని కుక్కను చంపేశాడు..!

ఇండోర్: పొరుగింటి వారి కుక్క తన భార్యను కరిచిందన్న కోపంలో ఓ వ్యక్తి ఆ కుక్కను గన్నుతో కాల్చి చంపేశాడు. దీంతో..నిందితుడు నరేంద్ర విశ్వయ్యను పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తన వద్ద ఉన్న రైఫిల్‌తో కుక్కను కాల్చాడని పోలీసులు తెలిపారు. జంతువును చంపినందుకు అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బుల్లెట్ మెడలోకి దూసుకుపోవడంతో కుక్క అక్కడిక్కడే చనిపోయిందని పోలీసులు చెప్పారు. కాగా.. తన భార్యనే కాకుండా ఇరుగు పొరుగు వారిని కూడా ఆ కుక్క పలుమార్లు కరిచిందని నిందితుడు పోలీసుల వద్ద వాపోయాడు. అతడి ఆరోపణల్లో వాస్తవం ఉందని తెలితే ఆ కుక్కును పెంచుకుంటున్న వారిపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. 

Updated Date - 2021-06-04T03:47:31+05:30 IST