సిలిగురి నుంచి Indo-Nepal బస్సు సర్వీసు ప్రారంభం
ABN , First Publish Date - 2022-07-07T12:35:43+05:30 IST
రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఉత్తర బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్బీఎస్టీసీ) సహాయంతో ఒక ప్రైవేట్ బస్సు ఆపరేటర్ సిలిగురి-కక్కర్విట్ట-ఖాట్మండు బస్సు సర్వీసును...
సిలిగురి (పశ్చిమబెంగాల్): రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఉత్తర బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్బీఎస్టీసీ) సహాయంతో ఒక ప్రైవేట్ బస్సు ఆపరేటర్ సిలిగురి-కక్కర్విట్ట-ఖాట్మండు బస్సు సర్వీసును ప్రారంభించారు.రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఫిర్హాద్ హకీమ్ ఈ బస్సు సర్వీసును ప్రారంభించారు.ఈ బస్సు టెన్జింగ్ నార్గే బస్ టెర్మినస్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు రోజూ నడుస్తుంది. 615 కిలోమీటర్లు ప్రయాణించి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు ఖాట్మండు చేరుకుంటుంది. ఒక్కొక్కరికి బస్సు టికెట్ ధర రూ.1500.‘‘చాలా గ్యాప్ తర్వాత ఈ బస్సు సర్వీసు ప్రారంభించటం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. ఉత్తర బెంగాల్, నేపాల్ మధ్య పర్యాటకం వృద్ధి చెందుతోంది,భవిష్యత్తులో మరింత ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటారు.
సిలిగురి నుంచి బంగ్లాదేశ్లోని ఢాకాకు బస్సు సర్వీసును నడపడానికి బంగ్లాదేశ్ వైపు నుంచి ఎన్ఓసి కోసం ఎదురుచూస్తున్నామని మంత్రి హకీమ్ చెప్పారు.పర్యాటక, వైద్య, మతపరమైన ప్రయోజనాల కోసం ప్రజలు నేపాల్కు వెళ్లడానికి బస్సు సర్వీస్ సహాయపడుతుందని భారతీయ బస్సు ఆపరేటర్ అనురాగ్ అగర్వాల్ చెప్పారు.