Patna: పాట్నాలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

ABN , First Publish Date - 2022-07-22T13:17:11+05:30 IST

ఇటీవల విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంతో విమానాలు నిలిచి పోతున్నాయి...

Patna: పాట్నాలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

పాట్నా(బీహార్):ఇటీవల విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంతో విమానాలు నిలిచి పోతున్నాయి.తాజాగా బాంబు బెదిరింపుతో ఇండిగో విమానం పాట్నా విమానాశ్రయంలో నిలిచిపోయింది.బీహార్ రాష్ట్రంలోని పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన 6ఈ2126 నంబరు గల ఇండిగో విమానంలోని ఓ ప్రయాణికుడు తన వద్ద బాంబు ఉందని చెప్పడంతో విమానాన్ని నిలిపివేశారు. ఇండిగో విమాన సర్వీసును రద్దు చేసి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు.ఈ ఘటన గురువారం అర్థరాత్రి పాట్నా విమానాశ్రయంలో జరిగింది. విమానంలో బాంబు ఉందని చెప్పడంతో ఆ విమానంలోని  ప్రయాణికులందరినీ కిందకు దించేశారు.విమానాశ్రయంలో ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.బాంబు ఉందని బెదిరించిన ప్రయాణికుడు రిషి చంద్ సింగ్‌గా గుర్తించారు. 


ప్రయాణికుడు రిషిచంద్ మానసికంగా సరిగా లేడని విమానాశ్రయ భద్రతా అధికారులు పేర్కొన్నారు.ఇండిగో విమానాన్ని నిలిపివేసి విమానం లోపల సోదాలు నిర్వహించగా ఎలాంటి బాంబు లభించలేదని పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు.ఇండిగో విమానంలో ఏమీ దొరకలేదు, కానీ ఇప్పటికీ ప్రోటోకాల్ ప్రకారం శోధన కొనసాగుతోంది.విమానసర్వీసును రద్దు చేశాం, రద్దు చేసిన విమానం శుక్రవారం బయలుదేరుతుంది’’ అని పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ చెప్పారు.

Updated Date - 2022-07-22T13:17:11+05:30 IST