ఇండిగో విమానంలో సాంకేతిక లోపం... ఫ్లైట్‌లో యనమల, రోజా

ABN , First Publish Date - 2021-12-14T19:54:53+05:30 IST

రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

ఇండిగో విమానంలో సాంకేతిక లోపం... ఫ్లైట్‌లో యనమల, రోజా

అమరావతి: రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. తిరుపతి ఎయిర్పోర్డులో ల్యాండింగ్ సాధ్యం కాకపోవడంతో దాదాపు గంట పాటు విమానం గాలిలోనే చక్కర్లు కొట్టింది. చివరకు  సిబ్బంది విమానాన్ని తిరిగి బెంగుళూరు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేసింది. విమానంలో మాజీ మంత్రి యనమల, టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఉన్నారు. అయితే వాతావరణ సమస్యా లేక సాంకేతిక సమస్యా అనే విషయంలో స్పష్టత ఇవ్వడం లేదని యనమల తెలిపారు. ఇండిగో సిబ్బంది సమాధానంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా... ఫ్లైట్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయాణికుల నుంచి ఇండిగో సిబ్బంది అదనపు రుసుము డిమాండ్ చేసింది. అయితే యాజమాన్యం తప్పిదానికి తామెందుకు డబ్బులు కట్టాలని ప్రయాణికుల మండిపడ్డారు. బెంగుళూరు నుంచి గమ్యం స్థానాలకు చేరేందుకు ప్రయాణికులు సొంత ఏర్పాట్లు  చేసుకున్నారు. 

Updated Date - 2021-12-14T19:54:53+05:30 IST