Sudhakar Dalela: అమెరికా సహా పలు దేశాలతో భారత దౌత్య సంబంధాలు బాగా మెరుగుపడ్డాయి
ABN , First Publish Date - 2022-07-28T13:14:04+05:30 IST
అమెరికాతోపాటు పలు ఇతర దేశాలతో భారత దౌత్య, వ్యాపార, వాణిజ్య సంబంధాలు బాగా మెరుగుపడ్డాయని వాషింగ్టన్ డీసీలో భారత డిప్యూటీ అంబాసిడర్గా పనిచేసి ఇటీవల పదోన్నతిపై భూటాన్ భారత రాయబారిగా నియమితులైన సుధాకర్ దలేలా తెలిపారు.
భూటాన్ భారత రాయబారి సుధాకర్ దలేలా వెల్లడి
అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): అమెరికాతోపాటు పలు ఇతర దేశాలతో భారత దౌత్య, వ్యాపార, వాణిజ్య సంబంధాలు బాగా మెరుగుపడ్డాయని వాషింగ్టన్ డీసీలో భారత డిప్యూటీ అంబాసిడర్గా పనిచేసి ఇటీవల పదోన్నతిపై భూటాన్ భారత రాయబారిగా నియమితులైన సుధాకర్ దలేలా తెలిపారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఏషియన్ ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. తానా పూర్వ అధ్యక్షుడు సతీష్ వేమన అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భారత ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారి రవి కోట తదితరులు మాట్లాడుతూ సుధాకర్ దలేలా సేవలను కొనియాడారు.