India-New Zealand 1st Test: Lunch Break..శుభమన్ గిల్ అర్ధసెంచరీ..టీమిండియా స్కోర్ ఎంతంటే..
ABN , First Publish Date - 2021-11-25T17:45:16+05:30 IST
న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో భారత్ లంచ్ సమయానికి వికెట్ నష్టపోయి 82 పరుగులు చేసింది. క్రీజులో శుభమన్ గిల్
కాన్పూర్: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో భారత్ లంచ్ సమయానికి వికెట్ నష్టపోయి 82 పరుగులు చేసింది. క్రీజులో శుభమన్ గిల్ (87 బంతుల్లో్ 4 ఫోర్లు, ఒక సిక్సర్తో 52 పరుగులు చేసి అర్ధ శతకం నమోదు చేసుకున్నాడు. గిల్కి జోడీగా 61 బంతులు ఆడిన నయా వాల్ పుజారా 15 పరుగులు చేసి..క్రీజులో ఇద్దరు కొనసాగుతున్నారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు భారత్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. 21 పరుగులకే తొలి వికెట్ మయాంక్ అగర్వాల్ రూపంలో కోల్పోయింది. జెమీషన్ బౌలింగ్లో బ్లండెల్కు మయాంక్ (13) క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన పుజారా, శుభమన్గిల్కు తొడుగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి 127 బంతుల్లో 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.