ఒలింపిక్‌ చాంప్‌కు షాకిచ్చి..

ABN , First Publish Date - 2021-02-27T09:08:38+05:30 IST

భారత యువ బాక్సర్‌ దీపక్‌ కుమార్‌ బల్గేరియాలోని సోఫియాలో జరుగుతున్న స్ట్రాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌..

ఒలింపిక్‌ చాంప్‌కు షాకిచ్చి..

 ఫైనల్లో బాక్సర్‌ దీపక్‌

న్యూఢిల్లీ: భారత యువ బాక్సర్‌ దీపక్‌ కుమార్‌ బల్గేరియాలోని సోఫియాలో జరుగుతున్న స్ట్రాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో అదరగొడుతున్నాడు. పురుషుల 52 కిలోల విభాగంలో ప్రపంచ, ఒలింపిక్‌ చాంపియన్‌ షఖోబిద్దీన్‌ జొరోవ్‌కు షాకిచ్చి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 4-1తో జొరోవ్‌ (ఉజ్భెకిస్థాన్‌)ను చిత్తుచేసి స్వర్ణానికి అడుగుదూరంలో నిలిచాడు. జొరోవ్‌ 2019లో భారత్‌కే చెందిన అమిత్‌ ఫంగాల్‌ను ఓడించి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. కాగా.. ఈ టోర్నీలో మరో భారత బాక్సర్‌ నవీన్‌ బూర (69 కి) క్వార్టర్స్‌లో ఎరవియో ఎడ్సన్‌ (బ్రెజిల్‌)ను ఓడించి సెమీ్‌సలో ప్రవేశించాడు.

Updated Date - 2021-02-27T09:08:38+05:30 IST