రెజ్లింగ్లో సుమిత్, సీమకు..
ABN , First Publish Date - 2021-05-08T09:24:00+05:30 IST
భారత రెజ్లర్ సుమిత్ మాలిక్ టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించాడు.
సోఫియా (బల్గేరియా): భారత రెజ్లర్ సుమిత్ మాలిక్ టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. వరల్డ్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీలో పురుషుల ఫ్రీ స్టయిల్ 125 కిలోల విభాగంలో సుమిత్ ఫైనల్లోకి ప్రవేశించి టోక్యో బెర్త్ దక్కించుకొన్నాడు. సెమీ్సలో సుమిత్ 5-0తో జోస్ డేనియల్ (వెనిజులా)పై గెలిచాడు. అయితే, మోకాలి గాయం కారణంగా సుమిత్ ఫైనల్ బౌట్ నుంచి తప్పుకొన్నాడు. భారత మహిళా రెజ్లర్ సీమా బిస్లా కూడా ఫైనల్కు దూసుకెళ్లి ఒలింపిక్ టిక్కెట్ ఖరారు చేసుకుంది. 50 కిలోల విభాగం సెమీస్లో సీమ 2-1తో అన్నా లుకా సియాక్ (పోలెండ్)పై గెలిచింది. శనివారం సీమ ఫైనల్ బౌట్ ఆడనుంది.