Australia టూర్‌ను ఓటమితో ఆరంభించిన టీమిండియా విమెన్స్ జట్టు

ABN , First Publish Date - 2021-09-19T02:10:20+05:30 IST

టీమిండియా మహిళల జట్టు ఓటమితో ఆసీస్ టూర్‌ను ప్రారంభించింది. వామప్ వన్డే మ్యాచ్‌లో భారత మహిళలు

Australia టూర్‌ను ఓటమితో ఆరంభించిన టీమిండియా విమెన్స్ జట్టు

బ్రిస్బేన్: టీమిండియా మహిళల జట్టు ఓటమితో ఆసీస్ టూర్‌ను ప్రారంభించింది. నేడు జరిగిన వామప్ వన్డే మ్యాచ్‌లో భారత మహిళలు 36 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ నెల 21 నుంచి ఇరు జట్ల మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. 279 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 242 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన పూజా వస్త్రాకర్ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. 57 పరుగులతో అదరగొట్టింది. దీప్తి శర్మ 49 (నాటౌట్), యస్తిక భాటియా 41 పరుగులు చేశారు.


106 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన వేళ వస్త్రాకర్, దీప్తి శర్మ కలిసి అద్భుతంగా ఆడి జట్టును గాడిలో పెట్టారు. బౌలింగులో ఝులన్ గోస్వామి 36 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టగా, మేఘనా సింగ్ బంతితో బ్యాటర్లను నిలువరించగలిగింది. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారం నుంచి సిరీస్ ప్రారంభం కానుండగా, మూడువన్డేలు, ఒక వన్ ఆఫ్ డే నైట్ టెస్టు, మూడు 20ల్లో ఇరు జట్లు తలపడతాయి. 

Updated Date - 2021-09-19T02:10:20+05:30 IST