క్వార్టర్స్‌లో అమ్మాయిలు

ABN , First Publish Date - 2020-10-20T08:54:11+05:30 IST

ఆసియా ఆన్‌లైన్‌ నేషన్స్‌ చెస్‌ చాంపియన్‌షి్‌పలో భారత మహిళల జట్టు క్వార్టర్స్‌ చేరింది.

క్వార్టర్స్‌లో  అమ్మాయిలు

ఆసియా టీమ్‌ చెస్‌ 

న్యూఢిల్లీ: ఆసియా ఆన్‌లైన్‌ నేషన్స్‌ చెస్‌ చాంపియన్‌షి్‌పలో భారత మహిళల జట్టు క్వార్టర్స్‌ చేరింది. లీగ్‌ దశ ముగిసేసరికి భారత్‌ 16 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకొంది. సోమవారం జరిగిన చివరి మూడు రౌండ్లలో భారత బృందం విజయబావుటా ఎగరేసింది. తొలుత ఫిలిప్పీన్స్‌తో జరిగిన ఏడో రౌండ్లో 3-1తో గెలిచిన భారత్‌.. ఆతర్వాత కజకిస్థాన్‌తో పోరులో 2.5-1.5తో పైచేయి సాధించింది. ఆఖరిదైన తొమ్మిదో రౌండ్లో వియత్నాంతో తలపడ్డ భారత్‌ 2.5-1.5తో విజయాన్ని అందుకుంది. టాప్‌బోర్డులో చెన్నై గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌. వైశాలి, రెండో బోర్డులో ఐఎం పద్మినీ రౌత్‌ దూకుడైన ఆటతీరుతో భారత్‌ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. లీగ్‌దశలో పాయింట్ల పట్టికలో భారత్‌ తర్వాతి స్థానాల్లో ఫిలిప్పీన్స్‌ (13), ఇరాన్‌ (13) ఉన్నాయి.

Updated Date - 2020-10-20T08:54:11+05:30 IST