అబూదాబి లాటరీలో కోట్లు గెలిచిన భారతీయుడి కోసం నిర్వాహకుల వెతుకులాట..

ABN , First Publish Date - 2021-10-05T00:15:04+05:30 IST

లాటరీలో అతడు దాదాపు 20 కోట్లు గెలుచుకున్నాడు..ఈ గుడ్ న్యూస్ చెబుదామని లాటరీ నిర్వహకులు ప్రయత్నిస్తుంటే అతడేమో వారికి అందుబాటులో లేకుండా పోయాడు. యూఏఈలో ఉంటున్న ఓ ప్రవాసీ భారతీయుడి ఉదంతం ఇది.

అబూదాబి లాటరీలో కోట్లు గెలిచిన భారతీయుడి కోసం నిర్వాహకుల వెతుకులాట..

ఇంటర్నెట్ డెస్క్: లాటరీలో అతడు దాదాపు 20 కోట్లు గెలుచుకున్నాడు..ఈ గుడ్ న్యూస్ చెబుదామని లాటరీ నిర్వాహకులు ప్రయత్నిస్తుంటే అతడేమో వారికి అందుబాటులో లేకుండా పోయాడు. యూఏఈలో ఉంటున్న ఓ ప్రవాస భారతీయుడి ఉదంతం ఇది. కేరళకు చెందిన నహీల్ నిజాముద్దీన్ యూఏఈలో నివసిస్తున్నాడు. ఆదివారం జరిగిన బిగ్ టికెట్ అబూదాబి సిరీస్‌ 232డ్రాలో అతడు ఏకంగా 10 మిలియన్ దిర్హామ్‌లు గెలుపొందాడు. సెప్టెంబర్ 26న నహీల్ టిక్కెట్ కొనగా ఇలా అనూహ్యంగా అతడిని అదృష్టం వరించింది. 


అయితే.. లాటరీ టిక్కెట్టు కొనే సమయంలో అతడు కేరళలో ఉన్న అడ్రస్‌ను పేర్కొన్నాడు. రెండు ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాడు. కానీ.. లాటరీ గెలిచిన విషయాన్ని అతడికి ఫోన్‌ ద్వారా తెలిపేందుకు నిర్వాహకులు ఎంతగా ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. అతడిచ్చిన రెండు ఫోన్ నెంబర్లు పనిచేయట్లేదని రిప్లై వస్తుండటంతో వారు ఆశ్చర్యపోతున్నారు. అయితే.. లాటరీ గెలుచుకున్న విషయాన్ని నహీల్‌కు చేరవేసేంత వరకూ ప్రయత్నిస్తూనే ఉంటామని నిర్వాహకులు తెలిపారు. ఇక సౌదీ అరేబియాలో నివసిస్తున్న యాంజెలో ఫర్నాండెజ్ ఈ లాటరీలో రెండో బహుమతిగా 1 మిలియన్ దిర్హామ్లను గెలుపొందాడు.        

Updated Date - 2021-10-05T00:15:04+05:30 IST