భారత జట్టు జింబాబ్వే పయనం
ABN , First Publish Date - 2022-08-14T08:56:37+05:30 IST
మూడు వన్డేల సిరీస్ కోసం కేఎల్ రాహుల్ నేతృత్వంలోని భారత జట్టు శనివారం తెల్లవారుజామున జింబాబ్వేకు పయనమైంది.
న్యూఢిల్లీ: మూడు వన్డేల సిరీస్ కోసం కేఎల్ రాహుల్ నేతృత్వంలోని భారత జట్టు శనివారం తెల్లవారుజామున జింబాబ్వేకు పయనమైంది. ఈనెల 18 నుంచి 22 వరకు జరిగే మూడు మ్యాచ్లకు హరారే వేదిక కానుంది. శిఽఖర్ ధవన్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్, రుతురాజ్, శార్దూల్లతో పాటు హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ విమానంలో సరదాగా దిగిన ఫొటోలను బీసీసీఐ ట్వీట్ చేసింది. ఆదివారం ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. ఈనెల 27 నుంచి ఆసియాకప్ జరుగుతుండడంతో కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రేలకు విశ్రాంతినిచ్చారు. దీంతో వీవీఎస్ లక్ష్మణ్ జట్టు చీఫ్ కోచ్గా, హృషికేశ్ కనిట్కర్ బ్యాటింగ్ కోచ్గా వ్యవహరిస్తారు. కనిట్కర్ ప్రస్తుతం అండర్-19 కోచ్గా ఉన్నాడు.