పాకిస్థానీలూ వెళుతున్నారు.. మాకు మాత్రం కుదరట్లేదు..! గగ్గోలు పెడుతున్న భారతీయ విద్యార్థులు!
ABN , First Publish Date - 2022-02-15T03:14:00+05:30 IST
చైనా వీసాలు జారీ కాని కారణంతో దాదాపు రెండేళ్లుగా స్వదేశంలోనే ఉంటున్న భారతీయ వైద్య విద్యార్థులు.. తమకు చైనా వీసా జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఇందుకు సంబంధించి ట్విటర్లో కొన్ని హ్యాష్ ట్యాగ్లు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం అనేక మంది భారతీయ విద్యార్థులు..
ఇంటర్నెట్ డెస్క్: చైనా వీసాలు జారీ కాని కారణంతో దాదాపు రెండేళ్లుగా స్వదేశంలోనే ఉంటున్న భారతీయ వైద్య విద్యార్థులు.. తమకు చైనా వీసా జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఇందుకు సంబంధించి ట్విటర్లో కొన్ని హ్యాష్ ట్యాగ్లు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం అనేక మంది భారతీయ విద్యార్థులు చైనాలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విషయం తెలిసిందే. కరోనా సంక్షోభం నేపథ్యంలో చాలా మంది భారత్కు తిరిగివచ్చేశారు. ప్రస్తుతం అక్కడి యూనివర్శిటీలు ఆన్లైన్ విధానంలో పాఠాలు చెబుతున్నాయి. అయితే.. ఇది తమకు అర్థం కావట్లేదంటూ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. వీసా కోసం తాము ఇచ్చిన దరఖాస్తులను చైనా తిరస్కరిస్తోందని చెబుతున్నారు.
‘‘దక్షిణ కొరియా, పాకిస్థాన్, ఇతర దేశాల విద్యార్థులకు చైనా ప్రభుత్వం వీసాలు జారీ చేస్తోంది. ఆయా దేశాల ప్రభుత్వాలు చైనా విదేశాంగ శాఖతో చర్చలు జరపడంతోనే ఇది సాధ్యమైంది. భారత విదేశాంగ శాఖ కూడా చైనాతో చర్చించి ఈ సమస్యను పరిష్కరించాలి’’ అంటూ చైనాలోని హెర్బిన్ యూనివర్శిటీలో చదువుతున్న ఓ ఎంబీబీఎస్ విద్యార్థి అభ్యర్థించాడు.