వూహాన్ నుంచి వచ్చిన భారతీయులు.. సోమవారం నుంచి ఇంటికి..

ABN , First Publish Date - 2020-02-17T03:32:33+05:30 IST

చైనాలోని వూహన్ నుంచి భారత దేశానికి వచ్చినవారికి నోవల్ కరోనా వైరస్ నెగెటివ్ అని నిర్థారణ అయింది. దీంతో వీరిని దశలవారీగా సోమవారం నుంచి తమ ఇళ్ళకు పంపించబోతున్నట్లు ఐటీబీపీ అధికారులు తెలిపారు.

వూహాన్ నుంచి వచ్చిన భారతీయులు.. సోమవారం నుంచి ఇంటికి..
?????? ????? ?????? ?????????...

చైనాలోని వూహన్ నుంచి భారత దేశానికి వచ్చినవారికి నోవల్ కరోనా వైరస్ నెగెటివ్ అని నిర్థారణ అయింది. దీంతో వీరిని దశలవారీగా సోమవారం నుంచి తమ ఇళ్ళకు పంపించబోతున్నట్లు ఐటీబీపీ అధికారులు తెలిపారు. వూహన్ నుంచి భారతదేశానికి 406 మందిని తీసుకొచ్చారు. వీరిని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ)కు చెందిన ప్రత్యేక కేంద్రంలో ఉంచి, పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం తుది నమూనాలు సేకరించి, పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. వీరందరికి నోవల్ కరోనా వైరస్ నెగెటివ్ అని నిర్థారణ అయిందని తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన వైద్య విధానాలు, నిబంధనలతో కూడిన మార్గదర్శకాల ప్రకారం వీరిని సోమవారం నుంచి దశలవారీగా విడుదల చేస్తామన్నారు. 

Updated Date - 2020-02-17T03:32:33+05:30 IST