Paralympics: టేబుల్ టెన్నిస్లో సోనల్, భావినా పటేల్ ఓటమి
ABN , First Publish Date - 2021-08-25T16:43:13+05:30 IST
టోక్యో పారాలింపిక్స్లో భారత పాడ్లర్లు భావినాబెన్ పటేల్,సోనాల్బెన్ పటేల్ ప్రారంభ రౌండులో మ్యాచ్ లు కోల్పోయారు....
టోక్యో (జపాన్): టోక్యో పారాలింపిక్స్లో భారత పాడ్లర్లు భావినాబెన్ పటేల్,సోనాల్బెన్ పటేల్ ప్రారంభ రౌండులో మ్యాచ్ లు కోల్పోయారు.ప్రపంచ నంబర్ వన్ చైనీస్ పాడ్లర్ జౌ యింగ్తో తలపడిన భావినాబెన్ మహిళల సింగిల్స్ క్లాస్ 4 గ్రూప్ ఎ మ్యాచ్లో 3-11 9-11 2-11 తేడాతో ఓడిపోయింది.మహిళల క్లాస్ 3 కేటగిరీలో పోటీపడుతున్న సోనాల్బెన్ 11-9, 3-11, 17-15, 7-11 4-11 తేడాతో ఓడిపోయారు. భారత పాడ్లర్లు భావినాబెన్ పటేల్, సోనాల్బెన్ పటేల్ తమ తమ ఈవెంట్లలో ప్రారంభ రౌండ్ ఓటములతో వెనుతిరిగారు.