Oxford University కీలక ప్రకటన.. భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2022-01-14T01:32:26+05:30 IST

భారత సంతతికి చెందిన వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ బిజినెస్ స్కూల్‌కు డీన్‌గా నియామకం అయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత్‌కు చెందిన సౌమిత్ర దత్తను సయిద్(Saïd) బిజినెస్ స్కూల్ డీన్‌గా నియమిస్తూ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ బుధవా

Oxford University కీలక ప్రకటన.. భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం

ఎన్నారై డెస్క్: భారత సంతతికి చెందిన వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ బిజినెస్ స్కూల్‌కు డీన్‌గా నియామకం అయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత్‌కు చెందిన సౌమిత్ర దత్తను సయిద్(Saïd) బిజినెస్ స్కూల్ డీన్‌గా నియమిస్తూ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం సౌమిత్ర దత్త.. న్యూయార్క్‌లోని కార్నెల్ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. యూనివర్సిటీ ప్రకటనపట్ల సౌమిత్ర దత్త సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. సయిద్ బిజినెస్ స్కూల్ డీన్‌గా జూన్ 1న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 




Updated Date - 2022-01-14T01:32:26+05:30 IST