సింగపూర్లో భారత సంతతి ప్రీతం సింగ్ సరికొత్త రికార్డు !
ABN , First Publish Date - 2020-09-01T20:28:33+05:30 IST
భారత సంతతికి చెందిన రాజకీయ నేత ప్రీతం సింగ్ సింగపూర్ రాజకీయ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. తొలి భారత సంతతి ప్రధాన ప్రతిపక్ష నేతగా సోమవారం ప్రీతం పార్లమెంట్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది జూలై 10న జరిగిన జనరల్ ఎన్నికల్లో ప్రీతంకు చెందిన వర్కర్స్ పార్టీ 10 సీట్లు గెలుచుకుని ప్రతిపక్ష హోదా దక్కించుకుంది.
సింగపూర్ సిటీ: భారత సంతతికి చెందిన రాజకీయ నేత ప్రీతం సింగ్ సింగపూర్ రాజకీయ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. తొలి భారత సంతతి ప్రధాన ప్రతిపక్ష నేతగా సోమవారం ప్రీతం పార్లమెంట్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది జూలై 10న జరిగిన జనరల్ ఎన్నికల్లో ప్రీతంకు చెందిన వర్కర్స్ పార్టీ 10 సీట్లు గెలుచుకుని ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. కాగా, ఇటు సభలో అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ పక్ష నేత ఇంద్రాణీ రాజ్హా కూడా భారత సంతతి వ్యక్తి కావడం గమనార్హం. ఇలా అధికార, ప్రతిపక్ష నేతలు ఇద్దరూ కూడా భారత మూలాలు ఉన్న వ్యక్తులే కావడంతో అక్కడి భారత ప్రవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ ఈసారి ఎన్నికల్లో మొత్తం 93 సీట్లకు గాను ఏకంగా 83 సీట్లు గెలుచుకుని భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.